హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ హామీని నిలబెట్టుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. జీవో -317 ద్వారా నష్టపోయిన టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, స్పౌజ్ బదిలీలను వచ్చే వేసవిలో చేపట్టాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పర్యవేక్షణ పేరుతో ఎస్సీఈఆర్టీలో తిష్టవేసిన వారిని తిరిగి పాఠశాలలకు పంపించి, సబ్జెక్టు టీచర్ల కొరతలేకుండా చూడాలని కోరారు. టెట్తో సంబంధం లేకుండా మల్టీ జోన్ -2లో మిలిగిపోయిన పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.