హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో జీవో-954 ప్రకారం పదోన్నతులు కల్పించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని ఉద్యోగుల బృందం టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింది. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కే కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, నాయకులు విజయ్కుమార్, అశోక్కుమార్, యాదగిరి, కొమురవెల్లి రవీందర్, రమాకాంత్, పిల్లి అశోక్గౌడ్, చంద్రుడు, మారం శ్రీనివాస్, శరత్బాబు, రాజేందర్, వెంకటేశ్, రంగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.