చౌటుప్పల్ రూరల్ : చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించనున్న జీఎస్టీని ఎత్తివేయాలని మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలోని నేతన్నలు నిరసనలకు దిగారు. ప్రధాని మోదీ జీఎస్టీని ఉప సంహరించేంతవరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. దశాబ్దాలుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని ఆదుకోవడం పోయి జీఎస్టీ పన్నుల భారంతో మరింత కృంగదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి బీ(టీ)ఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ ఎల్. రమణ ముఖ్య అతిథుగా హాజరై నేతన్నకు మద్దతు తెలియజేశారు. అనంతరం జీఎస్టీ ఎత్తివేయాలని ఉత్తరాలను రాసి పంపించారు. సంస్థాన్ నారాయణపురం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ప్రధాని మోదీకి పోస్ట్ కార్డును రాశారు.