నల్లగొండ, జనవరి 30: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డి మాండ్ చేశారు. బీబీనగర్లో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించడంతోపాటు కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నల్లగొండలో మంత్రి వెంకట్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి, మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్పై మాట్లాడే నైతిక హకు కోమటిరెడ్డికి లేదని అన్నారు.