BJP MLA Raghunandan Rao | చేగుంట, అక్టోబర్ 26: ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇటీవల చందాయిపేట, కసాన్పల్లి, అనంతసాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తమ గ్రామాలను ఏం అభివృద్ధి చేశావని వచ్చావం టూ మహిళలు, వృద్ధులు నిలదీశారు. దివంగత రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేసేవారని, అందరి గురించి అడిగేవారని గుర్తుచేశారు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు జారుకొన్నారు.