హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైదాబాద్లో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటనపై నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. హంతకుడిని కఠినంగా శిక్షించాలని వివిధవర్గాలు డిమాండ్చేస్తున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘ఈ అకృత్యాలకు అంతంలేదా? ఆడపిల్లగా పుట్టడమే పాపమా?’ అంటూ ప్రశ్నిస్తున్నట్టు తీర్చిదిద్దారు. పసలేని శిక్షలే ఆడవారికి శాపాలుగా మారాయి అని చాటి చెప్తున్నట్టు.. మహిళను వేధిస్తున్న ఒక మానవ మృగాన్ని ప్రదర్శిస్తూ సైకత కళాఖండాన్ని తయారుచేశారు.