ఆదిలాబాద్ : గిరిజన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయంబాపురావు (MP Soyam Bapu Rao ) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేస్లాపూర్లో నిర్వహించిన మహాసభలో ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలోని కొమరంభీం చౌక్లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ ఎంపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడు తున్నాడని ఆరోపించారు. బాపూరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.