బాసర, జనవరి 3: బాసర సరస్వతీ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేశ్పై ఐపీసీ 153, 504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు.
రాజేశ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం నిర్మల్ జిల్లా బాసరలో కులమతాలకు అతీతంగా సబ్బండవర్ణాలు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చాయి. బందులో భాగంగా ఆలయ ఆవరణ, రైల్వేస్టేషన్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్-బైంసా రోడ్డులోని శివాజీ విగ్రహం వద్ద రాజేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.