సూర్యాపేట : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరిసన సెగలు తగులుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండిని అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడి చేసినందుకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్ల పై దమ్ముంటే కేంద్రంతో యాసంగి ధాన్యాన్ని కొంటామని ప్రకటన చేయించాలన్నారు. చివ్వెంల మండలం కేంద్రంలోని ఐకేపీ సెంటర్ వద్ద బండికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.