ఆలేరురూరల్, జూలై 1: రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి తమతోపాటు కుటుంబసభ్యులతో మొక్కలు నాటించి వాటికి ఇంట్లో వారి పేర్లు పెట్టాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పిలుపునిచ్చారు. ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రభుత్వ పశువైద్య ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఉద్యోగులు పల్లె, పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని చెప్పారు. 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు మొక్కలు నాటి సంరక్షించడమే ఉద్యోగులిచ్చే బహుమతి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు మందడి ఉపేందర్రెడ్డి, మహ్మద్, జగన్, పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.