జోగులాంబ గద్వాల : జిల్లాలోని గట్టు ఎత్తిపోతల కాలువల కింద భూములు కోల్పోయిన రైతులకు(farmers) సత్వరం న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్(Collector) వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం కేటీ దొడ్డి మండలంలోని మల్లాపురం తండా గ్రామ పంచాయతీ కార్యాలయం లో గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూములు కోల్పోయిన రైతుల అవార్డు విచారణ నిమిత్తం కలెక్టర్ గ్రామంలో పర్యటించి రికార్డులను పరిశీలించారు.
కాలువల కింద భూములు కోల్పోయిన రైతులతో ఆమె మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూములు అప్పగించిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. గట్టు రిజర్వాయర్(gattu reservior) పనులను పరిశీలించి ఇసుక అనుమతి భూసేకరణ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ కట్ట ను పరిశీలించి ఇసుక, నల్లమట్టి కొరత లేకుండా భూసేకరణ సమస్య లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం ఆమె మల్లాపురం తండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ హైస్కూల్ను పరిశీలించారు. కలెక్టర్తో పాటు ఆర్డీవో రాములు, ఇరిగేషన్ అధికారి రహీముద్దిన్, తహసీల్దార్ సుందర్ రాజు, సర్పంచ్ శంకరమ్మ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.