హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా నూతన సర్వీసు రూల్స్ను రూపొందించి, విద్యాశాఖలో అన్నిస్థాయిలో పదోన్నతులు కల్పించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, టీఎస్జీహెచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి, కోశాధికారి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.