మహబూబాబాద్ : సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేసినప్పుడు అనుకున్న ప్రగతిని అలవోకగా సాధించవచ్చని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్డాక్టర్ యోగితా రాణా అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి సంక్షేమ హాస్టల్స్, పోస్ట్, ప్రి మెట్రిక్ స్కాలర్షిప్లపై ములుగు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. మహబూబాబాద్ జిల్లాకు మంజూరు చేసిన కోటీ నిధుల నుంచి సుమారు రూ.94 లక్షలు ఖర్చు చేశారని, మిగులు నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వసతి గృహాలలో బయో మెట్రిక్ లు పని చేయటం లేదని, వెంటనే మరమ్మతులు చేయించి హాజరు ను నమోదు చేయాలని ఆదేశించారు. హాస్టల్ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించి సొంత ఇంట్లో ఉన్నామనే భావన కలిగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలు మాస్క్ లు ధరించే విధంగా, సానిటైజేషన్ చేసుకునే విధంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి హాస్టల్ లో మెష్ డోర్ లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా ప్రతి రోజూ రాగి లడ్డు , పల్లి పట్టీలు అందించాలన్నారు.
పౌష్టికాహారం ను స్వయం సహాయక సంఘాలచే తయారు చేయించాలని సూచించారు. హాస్టల్ కొన్ని సోషల్ సైన్స్, diagrams, తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన వివరాలతో కూడిన చార్ట్ లు, విజ్ఞానానికి సంబందించిన స్లోగన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రతి రోజు బయో మెట్రిక్ హాజరు నమోదు చేయలని ఆదేశించారు. పోస్ట్, ప్రి మెట్రిక్ scholarships అందేలా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి scholarship అందే విధంగా చూడాలన్నారు.
కులాంతర వివాహాలకు సంబందించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లలో FIR రిజిస్టర్ అయిన వాటికి రిలీఫ్ ఎంత వరకు అందినవి అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్ర వాతావరణంతో పాటు వసతి గృహాలకు అవసరమయ్యే కరివేపాకు, ఉసిరి, నిమ్మ, జామ వంటి మొక్కలను పెంచాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ హన్మంతు నాయక్, ఉప సంచాలకులు రమాదేవి, నాలుగు జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, ASWO, HWO లు, తదితరులు పాల్గొన్నారు.