హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ఆదివాసీ గుంజాల గోండి లిపిని గుర్తించాలని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ఆదివాసీ లిపిలను, కళాఖండాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. రాష్ట్రపతి భవన్కు ఆదివాసీల కోయ చిత్రపటాలను ఆద్యకళ మ్యూజియం తరఫున బహూకరిస్తామని చెప్పారు. దీనికి రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేశారని, త్వరలోనే ఈ మేరకు చర్యలు తీసుకొంటారని ఆయన తెలిపారు.