చిక్కడపల్లి, ఏప్రిల్ 30: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్న భావనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కృష్ణానది వివాదం-మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల భవిష్యత్తు’ అంశంపై రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
దీనికి హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టకపోవటం వల్లే ఈ సమస్య ఏర్పడిందని విమర్శించారు. సమావేశంలో ఏ రాజేంద్రబాబు, ఎం రాఘవాచారి, ప్రముఖ సంపాదకుడు రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.