హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ ఎం కోదండరాంరెడ్డి, అమీర్ అలీఖాన్ను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎమ్మెల్సీలుగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రతిపాదనకు ఈ నెల 25న ఆమోదం తెలిపిన గవర్నర్.. తాజాగా అధికారికంగా ప్రకటించారు.