హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అమరుల త్యాగాలను మలినం చేసేలా, వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేసిందని తెలిపారు.
కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేక డిక్లరేషన్లు వెలువరిస్తున్న కాంగ్రెస్ మరింత అభాసుపాలవుతున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు మరోసారి తన అవేవికాన్ని బయటపెట్టుకున్నాయని చెప్పారు. కేవలం నాయకత్వ ఉనికి కోసం వెలువరిస్తున్న డిక్లరేషన్లు ఆ పార్టీ పాలిట డెత్ డిక్లరేషన్లు అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 92 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఐటీ శాఖ ‘తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జ్ పేరుతో కేంద్రాలను ఏర్పాటుచేసి సిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వివరించారు.