వీర్నపల్లి ;‘ప్రైవేటు స్కూల్ బస్సులు మా ఊరిలోకి రావొద్దు, మా పిల్లలను సర్కారు బడిలోనే చదివిస్తాం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. శుక్రవారం ఊరిలోకి వచ్చిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సును అడ్డుకున్నారు. ప్రభుత్వం రూ.6 కోట్లతో సకల వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నదని, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. గ్రామస్థుల ఆందోళనతో పాఠశాల బస్సు తిరిగి వెళ్లిపోయింది. –