హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ దవాఖానల నుంచి రూ.1.04 కోట్లు ప్రభుత్వం వసూలు చేసి కరోనా బాధితులకు తిరిగి ఇప్పించిందని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్- 2020ని ప్రభుత్వం అడాప్ట్ చేసుకొనే యోచనలో ఉన్నదని, ఇదే జరిగితే చట్ట ఉల్లంఘనలకు పాల్పడే దవాఖానలపై కఠినచర్యలకు వీలవుతుందని వివరించారు. ప్రైవేట్ దవాఖానలపై ఫిర్యాదుల పరిషారానికి ఐదుగురితో కమిటీ వేశామని, ఆ కమిటీకి 231 దవాఖానలపై 594 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు ఆయా దవాఖానలు వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి రాబట్టామని చెప్పారు. పలు ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రజారోగ్యశాఖ సంచాలకుడు నివేదికసమర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, కేరళ ఇతర రాష్ట్రాల్లో విధించిన జరిమానాల కంటే పది రెట్లు ఎకువగా విధించామని వివరించారు. ఇంతకంటే ఎకువ జరిమానాల విధింపునకుచట్టంలోనే వీల్లేదని చెప్పారు. ఈ వివరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. కరోనా వైద్య చికిత్సల పేరుతో అధిక ఫీజులతో దోపిడీకి పాల్పడిన దవాఖానలపై చర్యలు కఠినంగా ఉండాలని, మళ్లీ దోపిడీ చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఉండాలని రాష్ట్రానికి హైకోర్టు సూచించింది. కరోనాతో విధినిర్వహణలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకున్న విషయాన్ని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కేసులు ఎకువగా నమోదవుతున్న జీహెచ్ఎంసీతోపాటు వరంగల్ అర్బన్, నల్లగొండ, కామారెడ్డి, పెద్దపల్లి ప్రాంతాలపై ఎకువ దృష్టి పెట్టాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లోనే తరగతులు కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా వల్ల అనాథలైన పిల్లలసంరక్షణకు జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించామని, ఆ అధికారి ఫోన్నంబర్ ఆ పిల్లలకు ఇచ్చామని పేర్కొన్నారు. న్యాయవాది ఎల్ రవిచందర్ కల్పించుకొని పరీక్షలు మాత్రం భౌతికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. పిల్లో లేని అంశంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. తిరిగి డీపీహెచ్ శ్రీనివాసరావు కల్పించుకొని 2,300 మంది స్టాఫ్నర్సులను రెగ్యులర్ ప్రాతిపదికపై ప్రభుత్వం నియమించిందని వివరించారు. మందుల ధరలు తగ్గింపు అంశంపై కౌంటర్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని కేంద్రాన్ని ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. అదనపు సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్రావు స్పందిస్తూ.. రెండువారాల గడువు కోరారు. డెల్టా ప్లస్ వేరియంట్ కంటే ప్రమాదకరమైన లాంబా వేరియంట్ను పెరూ దేశంలో డబ్ల్యూహెచ్వో గుర్తించిందని, 30 దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టు తెలిపిందని అన్నారు. దీనిపై డీపీహెచ్ శ్రీనివాసరావు కల్పించుకొని డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమనే సూచనలు లేవని, కొత్త వైరస్ గురించి ఆందోళన అవసరం లేదని చెప్పారు.
జూన్ 21 నుంచి జూలై 3వ తేదీ మధ్యకాలంలో 14,68,962 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు డీఎంహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక అందజేశారు. ప్రభుత్వ దవాఖానల్లో1,14,21,759 మందికి టీకాలు వేశాం. రాష్ట్రంలో 2,73 కోట్ల మంది 18 ఏండ్లు పైబడినవాళ్లు ఉన్నారు. వీరిలో 16.39 లక్షలమందికి రెండో డోస్, 81.43 లక్షల మందికి తొలి డోస్ వేశాం. మరో 1.75 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉన్నది. 4.93 లక్షల మంది టీచర్లు, స్టాఫ్కు టీకాలు వేస్తున్నాం. ఎకువ రిస్ ఉన్న 43 గ్రూప్లకు చెందిన 34.86 లక్షల మందికి టీకాలు వేశాం. కరోనా తర్వాత మానసిక ఒత్తిళ్ల సమస్య ఎదురైతే వారి చికిత్సకు 9 టీచింగ్ దవాఖానల్లో 27 మంది సైకియాట్రిస్ట్లు, 42 మంది సీనియర్ పీజీ విద్యార్థులను అందుబాటులో ఉంచాం. మూడోదశ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం. 130 దవాఖానలను గుర్తించాం. ఇందులో 27,141 పడకలు అందుబాటులో ఉంచాం. 10,224 పడకలకు ఆక్సిజన్ సౌకర్యంఉన్నది. మిగిలిన పడకలకు ఆక్సిజన్ సదుపా యం కల్పిస్తాం. పిల్లలకోసం 6 వేలపడకలు సిద్ధంగా ఉన్నాయి. మూడోదశ వస్తే ఆదిలోనే కట్టడికి ప్రభుత్వం ముందస్తుగాఅన్నిచర్యలు తీసుకున్నది. అప్రమత్తంగా ఉన్నది’ అని అఫిడవిట్లో డీపీహెచ్ పేరొన్నారు.