హైదరాబాద్ : నగర పరిధిలోని జేఎన్టీయూ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ మెట్రోస్టేషన్ దగ్గర బస్సులో మంటలు చెలరేగి బస్ అంతా వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.