నాగర్కర్నూల్, మార్చి 12 : ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నాగర్కర్నూల్కు రానున్నారని బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాగర్కర్నూల్ సమీపంలోని ఉయ్యాలవాడ శివారులో బహిరంగసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. నాగర్కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్కు మద్దతుగా ఎన్నికల ప్రచారసభలో మోదీ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. భూత్పూర్-శ్రీశైలం జాతీ య రహదారి, గద్వాల నుంచి సూర్యాపేట వరకు రైల్వేలైన్ సాధనకు ప్రధాని మోదీకి సభలో విన్నవిస్తామని తెలిపారు.