హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే మోదీ సరార్ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చిందని, ఎస్బీఐ అధికారుల వెనుక కేంద్రం పెద్దలున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.