హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.137.76 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్ నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
హైదరాబాద్ బల్కంపేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి జూపల్లి బలంపేట ఎలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.