Essential Commodities | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ‘ఎవరైనా స్నేహితులు, చుట్టాలు ఇంటికి వస్తే కప్పు టీ ఇవ్వాలన్నా భయమేస్తున్న ది’.. ఇది ఓ మధ్యతరగతి గృహిణి ఆవేదన. ఐదారేండ్ల క్రితం అన్ని ఖర్చులు పోను నెలకు ఎంత లేదన్నా రూ.7 వేల దాకా పొదుపు చేసే వాళ్లం. ఇప్పుడు నెలాఖరులో చేబదుళ్లు చేయాల్సి వస్తున్నది. మరో ఉద్యోగి ఆక్రందన. ‘ఓహ్.. ఇవాళ టమాట కూర తెచ్చావా? అయితే, నువ్వు చాలా సంపన్నుడివే’ ఇలాంటి మాటలు ఇప్పుడు ఆఫీసుల్లో లంచ్ టేబుల్ వద్ద తరచూ వినిపిస్తున్నా యి. నిజమే. ఉప్పు, పప్పు, నూనె, కూరగాయ లు, గ్యాస్, పెట్రోల్ ఇలా ప్రతి సరుకు ధర మండిపోతున్నది. ఒకప్పుడు రెండు నెలలకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఏ రోజు అవసరాన్ని బట్టి ఆ రోజు కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చారు.
ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఇక చారు మెతుకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనే బాధను సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు అత్యధికుల నుంచి వస్తున్న ఏకైక సమాధానం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలన. 2014 నుంచి ఇప్పటివరకు వివిధ వస్తువుల ధరలు పెరిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఇది వట్టి ఆరోపణ కాదని అక్షర సత్యమని బోధపడుతున్నది. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక సరుకుల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరగడం ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ పరిస్థితి ఇంకెంత కా లం? ధరల పెరుగుదలకు కళ్లెం పడేదెప్పుడు? వీ టికి జవాబు చెప్పగలిగే పరిస్థితిలో కేంద్రం లేదు.
టమాట ధర చుక్కలు చూపిస్తుండటంతో సామాన్యులు దాని దరిదాపుల్లోకి కూడా పోవ టం లేదు. దేశవ్యాప్తంగా టమాట ధర రూ. 100కుపైనే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో రూ. 180-200 కూడా పలుకుతున్నది. దీంతో సామాన్యులు టమాట తినటమే మానేశారని లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్) వంటి సంస్థ లు సబ్సిడీ ధర రూ.90లకు టమాట అమ్మటం మొదలుపెట్టాయి. ఈ ధర కూడా మధ్యతరగతి, పేద వర్గాలకు భారంగా ఉన్నది. పదిరోజుల్లోనే టమాట ధర ఏకంగా 326.13 శాతం పెరగటం తో వినియోగదారులు కొనటం తినటం మానేశారని లోకల్ సర్కిల్స్ పేర్కొన్నది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
సర్వేలోని కీలక విషయాలు
హైటెక్సిటీలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తాను. నా జీతం రూ.25 వేలు. అమ్మ, నాన్న ఇంట్లోనే ఉంటారు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త మరణించాడు. పాలు, బియ్యం, ఇతర నిత్యావసరాల కోసం నెలకు రూ.9,552 వరకు ఖర్చు అవుతుంది. ఇంటి అద్దె రూ.8,500. పిల్లల రాకపోకలు, అనారో గ్యం, ఇతర ఖర్చులు నెలకు మరో 5 వేలు. నెలలో రెండుసార్లు మటన్ కొనుగోలు చేస్తే అదో రూ.2 వేలు. మొత్తంగా మా కుటుంబానికి నెలకు రూ.25 వేలకుపైగా ఖర్చు వస్తుంది. నెలాఖరులో చేబదులు కోసం చూడాల్సిందే. -ప్రవళిక, కొండాపూర్
ఐదేండ్లుగా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. గతంలో నెలవారీ ఖర్చులు పోనూ ప్రతి నెల రూ.7 వేల వరకు పొదుపు చేశాం. ధరల పెరుగుదలతో పొదుపు తగ్గింది. సంపాదన పెరగలేదు. కానీ, ఖర్చులు పెరిగాయి. దీంతో నెలవారీగా చెల్లించే చిట్టీ డబ్బులను కూడా అడ్జెస్ట్ చేయాల్సి వస్తున్నది.
-రాధిక, ఐటీ కంపెనీ ఉద్యోగి