హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
ఈ అంశంపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, విజిలెన్స్, సివిల్ సప్లయ్, ఎక్సైజ్ అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్కు చెందిన 17 సరిహద్దు జిల్లాల పరిధిలో 50 ప్రత్యేకంగా చెక్పోస్ట్లను ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. ఇందుకు అధికారులు సంయుక్తంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు.