భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో మావోయిస్టులు ఓ పోస్టర్ను చెట్టుకు కట్టి ఉంచారు. అలం బ్రహ్మ నాయుడు అనే యువకుడు ఆ పోస్టర్ను చూసి అక్కడికి వెళ్లాడు. దాన్ని చదివిన అనంతరం సెల్ఫోన్లో ఫోటో కూడా తీసుకున్నాడు.
అయితే బైక్పై తిరిగి వస్తుండగా.. ఆ చెట్టుకు కొంత దూరంలోనే ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో యువకుడి కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నాయుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఐఈడీ బాంబును అమర్చి ఉంటారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.