హైదరాబాద్, డిసెంబర్ 26 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లో శీతాకాల విడిది రద్దయింది. ప్రతి ఏటా శీతాకాలంలో సికింద్రాబాద్ పరిధి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి పర్యటన రద్దు చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి.