హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్ పంపించింది. రాష్ట్రపతి 13న ముంబై నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ముచ్చింతల్లో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. ఆ తరువాత రాష్ట్రపతి రాజ్భవన్కు చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. 14న ఉదయం 10.20 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు.