రంగారెడ్డి, జూన్ 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్కు రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.