హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగా ణ): వైమానిక దళంలో పనిచేసే ప్రతి అధికారి విధి నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకొని ఉ న్నదని, వైమానిక యుద్ధంలో సంపూర్ణ నైపు ణ్యం సాధించే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫ్లయింగ్ ఆఫీసర్లు సంసిద్ధులై ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. శనివారం దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ద్రౌపదిముర్ము రివ్యూయింగ్ ఆఫీసర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మా ట్లాడుతూ గతంలో భారత వైమానిక దళానికి విశేష సేవలందించిన వీరయోధుల గొప్ప వా రసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. 1948, 1965, 1971లో శత్రుదేశాలతో జరిగిన యుద్ధాల్లో దేశాన్ని రక్షించడంలో వైమానిక దళ వీర యోధులు కీలకపాత్ర పోషించారని.. కార్గిల్ పోరాటంలో, బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడంలో భారత వైమానికదళం అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించిందని కొనియాడారు.
విపత్తుల సహాయానికి ముందుండాలి
ఎయిర్ఫోర్స్ మొదటి నుంచీ విశేష సేవలందించంలో కీలకపాత్ర పోషిస్తున్నదని, విపత్తుల సమయంలో సహాయానికి దోహదపడుతున్నదని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఇటీవల టర్కీ, సిరియాలో భూకంపం సంభవించినప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నా వైద్యం, విపత్తు సహాయాన్ని అందించడానికి ఐఏఎఫ్ రంగంలోకి దిగిందని తెలిపారు. కాబూల్లో చికుకుపోయిన 600 మందికి పైగా భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు విశేష కృషి చేసిందని, కరోనా వంటి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో అనేక ఆపరేషన్లు విజయవంతం చేసిందని వివరించారు. కొత్తగా వైమానిక దళంలోకి అడుగుపెడుతున్న యువ అధికారులు ఆ సందర్భాల నుంచి, మన అధికారుల సమష్టి కృషి నుంచి స్ఫూర్తిపొందాలని పిలుపునిచ్చారు. యువ అధికారులు సాంకేతికతను అందుకోవడంలో ముం దుండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో సాంకేతిక యుద్ధాలు జరిగితే పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాఫెల్ ఫైటర్, అపాచీ అటాక్ హెలికాప్టర్, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ల ద్వారా వైమానిక దళాన్ని ఆధునికీకరించడం గొప్ప కార్యమని పేర్కొన్నారు.
కేసీఆర్ సాయంతోనే ఫ్లయింగ్ ఆఫీసర్
తమ కొడుకు భవి ష్యత్తు కోసం సీఎం కేసీఆర్ చేసిన సాయా న్ని జీవితంలో మర్చి పోలేమని ఫ్లయింగ్ ఆఫీసర్ నిఖిల్సాయి యాదవ్ తండ్రి కృష్ణ అన్నారు. ఎయిర్ఫో ర్స్ అకాడమీలో కం బైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో వనపర్తికి చెందిన సాయినిఖిల్ ఫ్లయింగ్ ఆఫీసర్గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తండ్రి కృష్ణ మీడియాతో మాట్లాడారు. 2019లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి ఎంపికైన తన కుమారుడికి కేసీఆర్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన కుమారుడి కృషి, పట్టుదల, దేశానికి సేవ చేయాలన్న సంకల్పమే రాష్ట్రపతి చేతుల మీదుగా ‘వింగ్స్’ అందుకునేలా చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.
మహిళా అధికారులు భాగస్వాములవ్వాలి
భారత వైమానిక దళం మహిళా అధికారులను చేర్చుకోవడం సంతోషంగా ఉన్నదని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. మహిళా ఫైటర్ పైలట్ల సంఖ్య గణనీయంగా పెరగాలని అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎయిర్ మార్షల్స్ రాజేశ్, చంద్రశేఖర్, త్రివిధ దళాల అధికారులు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరేడ్ అనంతరం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి చేరుకున్నారు.