హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాంత భూములు పత్తి ఉత్పత్తికి ఎంతో అనుకూలమని, మరింత ఉత్పాదకత పెంచేందుకు అవకాశం ఉందని అమెరికాలోని కాటన్ ఇన్కార్పొరేటెడ్లో వ్యవసాయ, పర్యావరణ పరిశోధన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కేటర్ హేక్ పేర్కొన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో భేటీ అయ్యారు.
ఆయనను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా కేటర్ హేక్ మాట్లాడుతూ పత్తి రైతులు పురోగతి కోసం అధిక సాంద్రత కలిగిన మొకల పెంపకం విధానాన్ని విస్తృతస్థాయిలో అమలు చేయాలని సూచించారు. పత్తి ఉత్పాదకతలో భారతదేశం అద్భుతమైన పురోగతిలో ఉన్నదని చెప్పారు. పత్తి సాగులో అత్యాధునిక శాస్త్రీయతను వినియోగించడం ఇప్పుడు చాలా కీలకమని సూచించారు.