నిజామాబాద్ : బోధన్ మండలం అందాపూర్ వద్ద 108లో ఓ గర్భిణి ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఊట్పల్లి గ్రామానికి చెందిన బండి ఐశ్వర్యకు శుక్రవారం తెల్లవారుజామున పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
ఊట్పల్లి చేరుకున్న 108 వాహనం.. గర్భిణిని బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో వైద్యుడు శ్రీకాంత్ సూచన మేరకు సదరు మహిళకు టెక్నీషియన్ లక్ష్మణ్, పైలట్ జావీద్ పురుడు పోశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 108 సిబ్బందిని సదరు మహిళ కుటుంబ సభ్యులు, వైద్యులు అభినందించారు.