హైదరాబాద్, జనవరి24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో ప్రకటించబోయే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రా ధాన్యం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను బుధవారం సెక్రటేరియట్లో ప్రత్యేకంగా కలిసి, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అపరిషృతంగా ఉన్న బీసీ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని కోరారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ జనగణన, బీసీ డిక్లరేషన్ అమలు, వి ద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మంత్రి తో చర్చించినట్టు వివరించారు. సమావేశం లో దొంత ఆనందం, బండారి పద్మావతి, దుర్గేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.