మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో పలువురు దివ్యాంగులు మంగళవారం హైదరాబాద్లో మంత్రి కొప్పులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగాల్లో, విద్యా సంస్థలోనూ దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యం, రిజర్వేషన్ కల్పిస్తున్నదని చెప్పారు. గృహలక్ష్మి పథకంలోనూ దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఉంటుందని, అర్హులైన వారు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.