హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని పార్టీ ఓయూ నేత కరాటే రాజు నాయక్ ఆకాంక్షించారు. ఈ మేరకు కాంబోడియాలోని ఆంగ్కోర్వాట్ గుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆంగ్కోర్ వాట్ గుడి ప్రపంచంలోని అతి పెద్ద హిందూ ఆలయంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.