హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల బాలాజీ కోట్ల హిందువుల ఆరాధ్య దైవమని స్పీకర్ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు అనంతరం మీడియాకు చెప్పారు.