BRS |హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని సౌత్నాగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్ షిండే శుక్రవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ పరంగా శివసేన (షిండే గ్రూప్) అయినా ఆ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ప్రవీణ్ షిండే బీఆర్ఎస్లో చేరటంతో ఒకవైపు శివసేనకు, మరోవైపు బీజేపీకి భారీ షాక్ తగిలినట్టు అయిందనే చర్చ మహారాష్ట్రలో జోరుగా సాగుతున్నది. సౌత్వెస్ట్ నాగపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని ప్రజల్లో రాజకీయంగా మంచి పట్టున్న శివసేన పార్టీ సీనియర్ నేతగా ప్రవీణ్ షిండేకు గుర్తింపు ఉన్నది. ఆయనతోపాటు బీఆర్ఎస్లో చేరిన పలువురు మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ధవలయన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విక్రమ్పిసే, పద్మశాలి యువసేన వ్యవస్థాపకుడు గౌతమ్సంగ, వ్యాపారవేత్త రఘురాములు కందికట్ల, సామ్రాట్ మౌర్యసేన అధ్యక్షుడు మహారాష్ట్ర అర్జున్ సల్గర్, బీజేపీ ఓబీసీ సెల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైభవ్షెట్, వదార్ సమాజ్ మహారాష్ట్ర కార్యదర్శి రాజు లింబోల్, శివానంద్ దారేకర్, మోచి సమాజ్ కార్యదర్శి మారండే షెర్ల, రాజు అసడే, రవి మేత్రే, సిధ్రామ్ మెహత్రే, శ్రీకాంత్ రౌత్, మనోజ్ డిగే, కిసాన్ నై, బాలకృష్ణనై, మహేష్ డోలారే, రూపేశ్ ఠాక్రే, మనీష్ గావండే, గిరిరాజ్ మర్దా, అభిజిత్ పవార్, ఆశిష్ షిండే, అంబాదాస్ తాడ్గొప్పుల్, ఆకాశ్ భవర్ తదితరులు ఉన్నారు. పార్టీలో చేరినవారు మహారాష్ట్ర సంప్రదాయ పద్దతిలో సీఎం కేసీఆర్ను గొంగడితో సన్మానించారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, అజయ్కుమార్, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి, విఠల్, ఎమ్మెల్యేలు బాల సుమన్, జనార్ధన్రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నేత శంకరన్న దోండ్గే పాల్గొన్నారు.