ఛత్తీస్గఢ్ ఘటనను మన రాష్ర్టానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం
తప్పు తెలుసుకొని ట్వీట్ తొలగించిన ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, మార్చి 27 : ఆయనో మాజీ ఐపీఎస్ అధికారి. విద్యావంతుడు. కానీ, బీఎస్పీలో చేరగానే ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయారు. ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తేనే ప్రజలు గుర్తిస్తారనే భ్రమలో ఉన్నారు. వివేకాన్ని మరిచి విమర్శలు చేస్తూ అభాసుపాలవుతున్నారు. ఆయనే బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ ఘటనను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆదివారం చేసిన ఓ ట్వీటే ఇందుకు నిదర్శనం. ఛత్తీస్గఢ్లోని సుర్గూజా జిల్లాకు చెందిన ఈశ్వర్దాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కూతురిని శుక్రవారం దవాఖానకు తీసుకెళ్లాడు. చికిత్సపొందుతూ బాలిక మరణించింది. అంబులెన్స్ అందుబాటులో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకొని 10 కిలోమీటర్లు నడిచి సొంతూరు చేరుకొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్గఢ్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దుతూ ప్రవీణ్కుమార్ ట్వీట్ చేశారు. ‘పాలకులకు సిగ్గు, శరం ఉండాలె. వైద్యశాఖకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ప్రభుత్వంలో ఉండి కష్టాలు తీర్చ డం చేతగాకపోతే గద్దె దిగండి’ అంటూ అతితెలివి ప్రదర్శించారు. ప్రవీణ్కుమార్ ట్వీట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ‘ఛత్తీస్గఢ్లో టీఆర్ఎస్ ప్ర భుత్వం ఉన్నదా?, అక్కడ జరిగితే తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్మడం ఏంది సారూ’ అని ఓ నెటిజన్ చురకలంటించాడు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పును తెలుసుకొని తన ట్వీట్ను తొలగించారు.