Prakash Ambedkar | శంషాబాద్ రూరల్ : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముని మనువడు ప్రకాశ్ అంబేద్కర్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రకాశ్ అంబేద్కర్కు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరమని వివరించారు.