Prajavani | జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను ఇకపై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం పదిగంటల లోపు జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్కు చేరుకున్న వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు.