తిరుమలాయపాలెం(ఖమ్మం) : బీజేపీ(BJP) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్ర(Bus Yatras)లు చేపడుతున్నట్లు సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabadram) తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల జనరల్బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం(Private) చేస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నదని ఆరోపించారు. మతం పేరుతో ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 24వ తేదీన తిరుమలాయపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బండి రమేశ్, మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, గ్రామ కార్యదర్శి పప్పుల ఉపేందర్, పద్మనాభుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.