ఖమ్మం, మార్చి 6 : సీపీఐ ఎంఎల్ మాస్లైన్(CPI ML Massline) పార్టీ జాతీయ కార్యదర్శిగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రదీప్సింగ్ ఠాగూర్(Pradeepsingh Tagore), సంయుక్త కార్యదర్శులుగా పోటు రంగారావు(తెలంగాణ), సుభాష్దేవ్ (త్రిపుర) ఎన్నికయ్యారు. 21 మందితో సెంట్రల్ కమిటీని ఎన్నుకోగా వారిలో 9 మందితో పొలిట్బ్యూరోను ఎన్నుకున్నారు.
అదేవిధంగా కంట్రోల్ కమిషన్ చైర్మన్గా తెలంగాణకు చెందిన రాయల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం ఖమ్మం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదీప్సింగ్ ఠాగూర్, పోటు రంగారావు, సుభాష్దేవ్ మాట్లాడారు. ఖమ్మం నగరంలో మూడు రోజుల జరిగిన జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీని ఓడించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. అఖిలభారత శ్రామికవర్గ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు కృషిచేస్తామని, ఐక్యంగా పోరాడాలని, అన్ని ఫాసిస్టు వ్యతిరేకశక్తులతో ఏకమై 2024 ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీ-ఆర్ఎస్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు.