ఖమ్మం, మార్చి 6 : సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రదీప్సింగ్ ఠాగూర్, సంయుక్త కార్యదర్శులుగా పోటు రంగారావు (తెలంగాణ), సుభాష్దేవ్ (త్రిపుర) ఎన్నికయ్యారు. 21 మందితో సెంట్రల్ కమిటీని ఎన్నుకోగా వారిలో 9 మందితో పొలిట్బ్యూరోను ఎంపిక చేశారు. కంట్రోల్ కమిషన్ చైర్మన్గా తెలంగాణకు చెందిన రాయల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదీప్సింగ్ ఠాగూర్, పోటు రంగారావు, సుభాష్దేవ్ మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీని ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు.