మాదాపూర్, జూన్ 28: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం తొమ్మిదేండ్లలోనే 90 సంవత్సరాల అభివృద్ధిని సాధించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎఫ్టీసీసీఐ (ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐఐటీఈఎక్స్ ఎక్స్పో -2023 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ, ఇండస్ట్రీ రంగాలు అత్యంతవేగంగా అభివృద్ధి చెందాయని, వ్యవసాయ, విద్యుత్తు రంగాలు ఎంతో పురోగతి సాధించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో మిల్లెట్లకు అధిక ప్రాధాన్యం ఉందని, వాటిని పండించేందుకు ఇక్కడ అనేక మార్గాలున్నాయని వివరిం చారు. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ చేరువ చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ ఎనర్జీ సేవిం గ్, ఇండస్ట్రియల్ లైట్స్, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి జగదీశ్రెడ్డి ప్రదర్శించారు.
అనంతరం మంత్రికి ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు అనీల్ అగర్వాల్ మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య, లతో పాటు ఎఫ్టీసీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, టీఎస్ఐఐసీ వైస్ చైర్మెన్ నరసింహారెడ్డి, టీ హబ్ సీఈవో శ్రీనివాసరావు మహంకాళి, ఐసీఏఆర్ డైరెక్టర్ తారా సత్యవతి, టీఎస్టీపీసీ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.