హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేసేందుకు వీలుకల్పించాలని సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
ఇరుపక్షాల వాదనలు శుక్రవారం ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.