హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థి కందాడి మణిపాల్రెడ్డి, రఘుమారెడ్డి 27 మంది స్వతంత్ర అభ్యర్థుల తరుపున బుధవారం సీఈవో వికాస్రాజ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం, పరిస్థితులు లేవన్నారు. మద్యం ఏరులై పారుతుందని, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని అన్నారు. అందుకే ఎన్నికను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఆయన కోరారు.