హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడిన వృద్ధులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తృత ప్రచారం నిర్వహించాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తదుపరి ఇంటి వద్ద నుంచే ఓటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని, 12 డీ ఫారం పూర్తి చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందివ్వాలని, ఆ ఫామ్ సేకరించే బాధ్యత బూత్ స్థాయి ఆఫీసర్లదేనని వివరించారు. ఫారం 12డీతో పాటుగా దివ్యాంగ ఓటర్లు వికలాంగ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.