ఏటూరునాగారం, ఆగస్టు 25: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. హుస్సేన్, హసీనా దంపతుల కుమారుడు తాహెర్ షరీఫ్.. ఇటీవల నిర్వహించిన నీట్లో 497వ ర్యాంకు రావడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది.
ఏటూరునాగారంలో నాలుగో తరగతి వరకు, ఐదు నుంచి పదోతరగతి వరకు వరంగల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివాడు. నిజామాబాద్లోని మైనార్టీ కళాశాలలో సీటు రావడంతో అక్కడే ఇంటర్ పూర్తి చేశాడు.