బీజేపీ నేత బండిపై మాజీ ఎంపీ పొన్నం ఫైర్
రాంనగర్, మే 28: మసీదులు కూల్చితే రామరాజ్యం వస్తుందా? అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్ని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శనివారం చొక్కారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పూటకోమాట మాట్లాడుతున్న బండి సంజయ్ రాజకీయాల్లో ఓ పెద్ద జోకర్ అయిపోయాడని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్లో నంబర్వన్గా నిలిచాడన్నారు.