పెబ్బేరు/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 27: జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట బీఆర్ఎస్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందచేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ అధ్యాపకులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు.